AP Govt : ఉద్యోగుల విషయంలో ఏపీప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఉద్యమం వల్లే రాష్ర్ట ప్రభుత్వం దిగొచ్చిఈనిర్ణయం తీసుకుందని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఏమి లేని చోట ఏదో ఒక నిర్ణయం వచ్చిందని, సంతృప్తి చెందాలని చెప్పుకొచ్చారు.
అయితే ఇక్కడ జీపీఎస్ విధివిధానాలపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. 28 శాతం పెన్షన్ ఇస్తామన్నా, ఇప్పుడు 50 శాతం ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. ఓపీఎస్ తరహాలోనే ఏడాదికి రెండుసార్లు డీఆర్, ఉద్యోగి చివరి జీతంలో 50 శాతం పింఛనుగా ఇచ్చేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. కానీ ఉద్యోగులు మాత్రం జీపీఎస్ కు బదులు ఓపీఎస్ ను కోరుకుంటున్నారని తెలిపారు. బిల్లు పెట్టే నాటికి పాత పెన్షన్ విధానాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నామని బొప్పరాజు తెలిపారు. అయితే ఏపీ సచిలవాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం కేబినేట్ లో తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా తెచ్చిన గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్(జీపీఎస్) బాగుందన్నారు. 50 శాతం పెన్షన్ ఇచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు. ఏమీ లేని చోట ఏదో ఒకటి రావడం సంతోషమేనని తెలిపారు.
మరోవైపు జీపీఎస్ విధానాన్ని కొందరు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఓపీఎస్ విధానమే కావాలని పట్టుబడుతున్నారు. మరోవైపు కొన్ని సంఘాలు సర్కారు నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. జీపీఎస్ విధానం బాగుందని, 50 శాతం పింఛన్ అందించడం నిర్ణయం అభినందనీయమని చెబుతున్నారు.