అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల అంశంపై మాత్రం ఏపీలో చర్చ కొనసాగుతున్నది. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే స్పష్టంగా పొత్తులపై ప్రకటన చేశాయి. మరి బీజేపీ ఎటూ తేల్చడం లేదు. అయితే టీడీపీ, జనసేన పార్టీల్లో సీట్లు సర్దుబాటు అంశం కొంత చర్చనీయాంశమవుతున్నది. జనసేన 30 నుంచి 40 సీట్లు అడిగే అవకాశమున్నదని టాక్ బయటకు వస్తున్నది. ఇక్కడే అసలు కథ మొదలు కాబోతున్నది. ఇన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా లేరు. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్ధులను టీడీపీ ఖరారు చేసింది. మరికొన్ని చోట్ల త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతన్నది. అయితే ఆయా ప్రాంతాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇలాంటి చోట్ల అభ్యర్థుల ఖరారు కొలిక్కి వస్తుందా అనేది సందేహాంగానే కనిపిస్తున్నది. ఇరు పార్టీలు పట్టుకు పోతే మొదటి కే మోసం వచ్చేలా కనిపిస్తున్నది. అయితే అధినేతలు మాత్రం పొత్తు ఉంటుందని చెబుతున్నారు. అయితే వారి రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధంగా ఉందని కొంత మంది భావిస్తున్నారు. అయితే కొన్ని సీట్ల పైనే ఇప్పుడు స్పష్టత రావడం లేదు. టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నచోట జనసేన పట్టుపడితే ఎలా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. విజయవాడ సెంట్రల్ సీటు ఇప్పుడు రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉండబోతున్నది. అక్కడ ఇప్పటికే టీడీపీ బొండా ఉమను ప్రకటించింది. అయితే ఇక్కడి నుంచి వంగవీటి రాధా కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. సత్తెనపల్లిలో జనసేన కోరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అక్కడ కన్నా లక్ష్మీనారాయణ, కొడెల శివరాం ఉన్నారు. తెనాలి అంశం కూడా కొంత టఫ్ గానే ఉంది. అయితే అక్కడ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. నాదెండ్లకు ఎమ్మెల్సీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇస్తామని టీడీపీ ఆఫర్ చేయబోతున్నదని సమాచారం.
ReplyForward
|