Crime News : సినీ ఫక్కీలో ఓ వ్యక్తికి బదులు మరో వ్యక్తి ప్రాణం తీసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ పరిణామానికి అందరు షాక్ కు గురయ్యారు. అంతవరకు అది ప్రమాదంగా భావించారు. కానీ అది హత్య అని తెలియడంతో అయోమయానికి లోనయ్యారు. సమాచారం తెలియడంతో అవాక్కయ్యారు. సినీ ఫక్కీలో మలుపులు తిరిగిన ఇది అచ్చు సినిమా కథను తలపించింది.
రంగంపేట మండలం వీరంపాలెంలో శుక్రవారం ఓ హత్యోదంతం పరుగులు పెట్టించింది. ధాన్యం వ్యాపారి కేతమళ్ల పూసయ్యకు చెందిన పొలంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద దాదాపు పూర్తిగా కాలిపోయిన డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పంచనామా నిర్వహించి పోస్టుమార్టమ్ కు ఆస్పత్రికి తరలించారు.
చనిపోయింది పూసయ్యగా భావించారు. కానీ కాసేపటికి పూసయ్య నుంచి ఫోన్ రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. మరి చనిపోయింది ఎవరని ఆరా తీశారు. పూసయ్యగా భావించి వేరే వ్యక్తిని హత్యచేసినట్లు గుర్తించారు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. అసలు పూసయ్యను చంపానుకుంది ఎవరు? ఎవరిని చంపారు? పూసయ్య స్థానంలో చనిపోయింది ఎవరనే ప్రశ్నలు వస్తున్నాయి.
పూసయ్యను చంపాలనుకుంది ఎవరు? ఎందుకు మరొకరిని చంపారు? కేసులో అన్ని ట్విస్ట్ లే ఉండటం గమనార్హం. ఆ రోజు తన పొలంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఒకరిని చంపి దహనం చేయడం చూశాడు. ఎవరని ప్రశ్నించగా వారు అతడిని అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి ఎక్కడో వదిలేశారు. మెలకువ వచ్చిన ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపితే ఇంకా చాలా విషయాలు తెలిసే అవకాశముంది.