Onion : ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో మనం ప్రతి రోజు కూరల్లో వాడుతుంటారు. ఇంకా మధుమేహం ఉన్న వారు పచ్చి ఉల్లిని ఆహారంలో భాగంగా తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఉల్లి వినియోగం ప్రస్తుతం ఎక్కువగా పెరిగింది. ఉల్లి తినడం వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
ఉల్లి ఎగుమతులపై కేంద్రం 40 శాతం సుంకం విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రైతుల శ్రేయస్సుపై కేంద్రం మరోసారి కక్ష్యపూరితంగా వ్యవహరిస్తుందని రైతులు ఆరోపిస్తోంది. ఉల్లిని అధిక మొత్తంలో ఎగుమతి చేయడం ద్వారా కొద్దోగొప్పో లాభాలు పొందొచ్చని భావిస్తుంటే ఇప్పుడు కేంద్రం నిర్ణయం గుదిబండగా మారింది.
మహారాష్ట్రలో తగిన వర్షపాతం లేనందున మార్కెట్ లోకి కొత్త ఊళ్లు రావడం ఇప్పటికే ఆలస్యం అయింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నష్టం కలిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోల్ సేల్ మార్కెట్లో ధర్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉల్లి ధర పెరగనున్నందున ఎగుమతులు చేయరాదని కేంద్రం నిబంధన విధించడం గమనార్హం.
కొత్తగా విధించిన 40 శాతం సుంకం 2023 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని శనివారం కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో సెప్టెంబర్ లో ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వకు 9.75 లక్షల టన్నుల ఉల్లి మన దేశం నుంచి ఎగుమతి అయింది. దీంతో ఉల్లి ఎగుమతులపై సుంకం విధించినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ లో ఉల్లి ధరలు కొండెక్కనున్న నేపథ్యంలో ఎగుమతులపై నిబంధనలు విధిస్తోంది. ఎగుమతులు విచ్చలవిడిగా సాగితే అందరు నిలువ చేసుకుని ధరలు పెరిగిన తరువాత అమ్ముకుంటారనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగానే ఎగుమతులపై 40 శాతం పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో ఉల్లి ధరలు పెరిగితే సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.