India Chandrayaan-3 : భారత దేశం చంద్రయాన్ -3 ప్రయోగం జరిపి విజయం సాధించింది. దీంతో చంద్రుడిపై కాలు మోపిన అమెరికా, రష్యా, చైనాల సరసన చేరింది దీంతో మనదేశ ఖ్యాతి ఇనుమడించింది. ప్రపంచదేశాలు మన పనితీరును ప్రశంసిస్తోంది. మనదేశం దక్షిణ ధ్రువం మీద కాలు మోపడం అందరిలో ఆశ్చర్యాన్ని నింపింది. చందమామపై మన ప్రయత్నం సక్సెస్ సాధించడం విశేషం.
అసలు జాబిల్లి దక్షిణ ధ్రువాన్ని ఎందుకు ఎంచుకున్నాం. అందరు దక్షిణ ధ్రువమంటే భయపడితే మనం మాత్రం దక్షిణ ధ్రువం ఎంచుకుని మరీ పరిశోధనలు జరపడం ఇతర దేశాలకు కాస్త విడ్డూరంగానే అనిపిస్తోంది. చంద్రుడి మీద లూనార్ వాటర్ ఉంటుంది. ఇది అంతరిక్షంలో ఒక చోట నుంచి మరో చోటికి పంపించవచ్చు. దీనికి అంత శక్తి ఉంటుంది. దక్షిణ ధ్రువం ఉండే కేటర్స్ కి నీడ ఎక్కువగా ఉండటంతో ఆ నీళ్లు ఆవిరి కాకుండా ఇతర ద్రవాలు అందులో కలవకుండా అవి కాపాడతాయి.
ఈ క్రేటర్స్ లో లూనార్ వాటర్ ఉంటాయి. లూనార్ మైనింగ్ కార్యకలాపాలు చేయడానికి సాయపడతాయి. దక్షిణ ధ్రువంలో ఖనిజాలు, లోహాలు ఉంటాయి. అందుకే ఇక్కడ పరిశోధనలు చేస్తే కొత్త విషయాలు కనుగొనే అవకాశం ఉంటుంది. దీంతోనే మనం దక్షిణ ధ్రువం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మన ప్రయత్నం సక్సెస్ కావడంతో జాబిల్లి గురించి మనకు అనేక విషయాలు తెలిసే అవకాశం ఉంది.
చంద్రుడిపై దిగిన రోవర్ మనకు 14 రోజుల పాటు సేవలు అందించనుంది. అక్కడి పరిస్థితులను ఫొటోలు తీస్తూ నిరంతరం మనకు అనేక పరిశోధనలు జరిపేందుకు పరోక్షంగా దోహదం చేయనుంది. జాబిల్లిపై మనకు అది అందించే ఫొటోల ఆధారంగా మన భవిష్యత్ చర్యలు ఆధారపడి ఉంటాయి. చంద్రుడి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ముందుకు వెళ్లే సూచనలు ఉన్నాయి.