Pooja Hegde out : మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ ఇటీవల రిలీజై భారీ వ్యూవ్స్ దక్కించుకుంది. మహేశ్ బాబును వీరమాస్ లో చూపించనున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక, మహేశ్ బాబు సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. అయితే రీసెంట్ గా ఒక పుకారు బయల్దేరింది. ఈ ప్రాజెక్ట్ నుంచి పూజాహెగ్డే తప్పుకుందని. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆమె వెళ్లిపోయేందుకు కారణం హీరో మహేశ్ బాబే అని ఆరోపణలు సైతం చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం వరుస పరాజయాలతో ఉన్న పూజాహెగ్డేకు ఈ మూవీ చాలా కీలకం కానుంది. ఇది తెలిసి కూడా ఎందుకు వెళ్లిందని ఇండస్ట్రీలో ప్రశ్నలు మొదలయ్యాయి. బిగ్ స్టార్ తో బిగ్ డైరెక్టర్ భారీ ప్రాజెక్ట్. దీన్ని ఆమె వదులుకునే ఛాన్సే లేదు. కానీ వెళ్లిపోయిందని, నిర్మాతలు ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా వెనక్కు తిరిగి ఇచ్చేసిందని చర్చలు వినిపిస్తున్నాయి. అయితే మహేశ్ బాబుకు పూజాహెగ్డే అంటే ఇష్టం లేదని అందుకే ఆమెను ఇబ్బంది పెట్టాడని, పొమ్మనలేక పొగబెట్టాడని కొందరు అనుకుంటున్నారు. కానీ దీనిని ఎవరూ సమర్థించలేదు, అలా అని ఖండించనూలేదు.
ఈ పుకార్లను ఇండస్ట్రీ పెద్దలు కొట్టిపారేస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్ లో మహేశ్ బాబుపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఒక్క హీరోయిన్ కూడా ఆయన గురించి ఇప్పటి వరకు తప్పుగా మాట్లాడిందిలేదు. ఈ నేపథ్యంలో ఇది కేవలం పుకారు మాత్రమే అని తెలుస్తోంది. అయితే దర్శక, నిర్మాతలకు ఇష్టంలేక ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తప్పించారని కూడా చెప్పుకుంటున్నారు. ఆమె స్థానంలో డైరెక్టర్ ఎవరిని తీసుకుంటారని చర్చ కొనసాగుతుంది. గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్ కు ఈ ఛాన్స్ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
దీన్ని ఎవరూ నిర్ధారించకున్నా.. ఇది కనుక వాస్తవం అయితే పూజాహెగ్డేకు ఇది పెద్ద దెబ్బే అనుకోవచ్చు. బ్యాడ్ లక్ ఆమెను వెంటాడుతుందనడానికి ఇది ఒక నిదర్శనం. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను మార్చారని వాదన వినిపిస్తోంది. అసలు ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. అసలే ప్రాజెక్ట్ ఆలస్యంగా మొదలైతే.. ఈ సమయంలోనే మహేశ్ బాబు తల్లి చనిపోవడం, తర్వాత తండ్రి చనిపోవడం ఇలా రెండు సార్లు చాలా నెలలు షూటింగ్ నిలిపివేశారు. అయితే, జూన్ 12 నుంచే కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాలి, కానీ నటుల డేట్స్ కుదరకపోవడంతో ఆగస్ట్ జూలైకి వాయిదా వేయాల్సి వచ్చింది.