Bhagwant Kesari : బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మొదటి చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పోస్టర్ గతంలో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాపై భారీగా రూమర్స్ వస్తున్నారు. ఈ సినిమా కూడా ఒక సినిమాకు రిమేక్ గా వస్తుందని రూమార్లు మొదలయ్యాయి.
గతంలో బాలకృష్ణ అన్న హరికృష్ణ చేసిన సినిమా ‘స్వామి’ మూవీకి ఈ సినిమా మరో రిమేక్ అన్న న్యూస్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది. దీంతో చిత్ర యూనిట్ హైరానా పడింది. అసలు ఈ రూమర్ ఎలా స్ప్రెడ్ అయ్యిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అయితే ఇది రిమేక్ కాదని.. స్వామి సినిమాలోని చిన్న లైన్ కూడా ఇందులో లేదని డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ కొంచెం తేరుకున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ లు వరుస ఫ్లాపులకు గురవుతున్నాయి. తమిళంలో భారీ విజయం సాధించిన ‘వినోదయం సీతం’ను తెలుగులో ‘బ్రో’గా రిలీజ్ చేయగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే తమిళంలోని ‘వేదాళం’ సినిమాను చిరంజీవితో ‘భోళా శంకర్’గా తీయగా అది కూడా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో భగవంత్ కేసరి రీమేక్ అనడంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ గుండెల్లో రైల్లు పరుగెత్తాయి. యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో కుదుట పడ్డారు.
‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది భగవంత్ కేసరిని నిర్మిస్తున్నారు. బాలకృష్ణకు జంటగా కాజల్ నటిస్తుండగా.. హీరో కూతురు వరుస అయ్యే పాత్రలో శ్రీలీల కనిపించనుందట. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఇందులో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు రాంపాల్. దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ వేగంగా పని చేస్తుంది.