Brother Anil Kumar : వైఎస్ఆర్సిటిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో టిడిపి పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి బేటి కావడం ప్రస్తుతం చర్చనీ యాంశంగా మారింది. ఇడుపులపాయలోని వైయస్ షర్మిల గెస్ట్ హౌస్ లో అనిల్ లో కలిసి బీటెక్ రవి మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఇతర అంశాలపై ఇద్దరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బీటెక్ రవి అనిల్ కుమార్ ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
వైయస్ షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతి రేకంగా ఉన్న వ్యక్తి బీటెక్ రవి ప్రస్తుతం పులివెందుల టిడిపి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేస్తారని తెలుస్తుంది. బావ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న బీటెక్ రవితో భేటీ కావడం పట్ల వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఎప్పటి నుంచో ఉంది. అన్నకు నచ్చని వ్యక్తి మాకు నచ్చాలని లేదు కదా అన్నట్లుగా ఉంది వైఎస్ షర్మిల ఫ్యామిలీ తీరు రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నాయి అన్న సంకేతాలు వెలువడతున్నాయి.