Marriage Issue : ఏపీలోని ప్రకాశం జిల్లాల్లో దారుణం జరిగింది. తన పెండ్లి చేయట్లేదని ఏకంగా తండ్రినే హత్య చేశాడు ఓ కొడుకు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. తనకు పెండ్లి చేయట్లేదని కోపంతో తండ్రిని చంపడం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లూ సాకిన తండ్రి అనే మమకారం లేకుండా ఇలా హత్య చేయడంపై పలువురు మండిపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇప్పటికే పోలీసులు కేస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం..
ఏపీలోని ప్రకాంశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన బాలభద్రాచారికి గురు నారాయణ అనే కొడుకు ఉన్నాడు. తనకు వయస్సు పెరుగుతున్నా, తండ్రి పెండ్లి చేయట్లేదని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఉదయం తండ్రిని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అక్కడే తండ్రిని కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.
అనంతరం గురునారాయణ కూడా కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి, వెంటనే గురునారాయణను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఒంగోలులోని దవాఖానలో చికిత్స పొందతున్నాడు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ వీరారాఘవరెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కన్నకొడుకే తండ్రిని చంపడం ప్రకాశం జిల్లాల్లో చర్చనీయాంశమైంది. శనివారం తెల్లవారు జామున ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం గురునారాయణ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. తనకు పెండ్లి చేయడం లేదని కక్ష పెంచుకొని ఇలా చేయడం పలువురిని విస్మయానికి గురి చేసింది.