Politics Ruling Justice : వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఫర్వాలేదు. మనదేశంలో చట్టాలపై కూడా రాజకీయాల ప్రభావం ఉంటుంది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు రాజకీయాల్లో ఉండే వారికి అన్ని అనుకూలంగా ఉంటాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అయినా ఢిల్లీ లిక్కర్ కుంభకోణాల్లో అయినా ఎంపీలు అవినాష్ రెడ్డి, కల్వకుంట్ల కవితలు కనీసం జైలుకు కూడా వెళ్లకుండా చేయడంలో ఎవరు మలుపు తిప్పారో తెలిసిందే.
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు మాత్రం బెయిల్ రాకుండా చేస్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో ఆప్ ఉపముఖ్యమంత్రి మనీష్ పిసోడియాకు సైతం బెయిల్ రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు ఎస్కార్ట్ బెయిల్ లభించింది. కానీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు మాత్రం బెయిల్ రాకుండా చేసింది ఎవరో తెలుస్తూనే ఉంది.
కోడికత్తి కేసులో ఐదేళ్లేగా శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాస్ కు బెయిల్ దొరకడం లేదు. కాకినాడలో దళిత యువకుడిని కిరాతకంగా హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వచ్చింది. వారి అనుయాయులకు మాత్రం చట్టం చుట్టంగానే ఉంటుంది. అధికారంలో ఉన్న వారికి ఎదురు తిరిగితే వారికి బెయిల్ లభించకుండా చేయడం సహజమే.
న్యాయం నిష్పక్షపాతంగా జరగాలని అందరు కోరుకోవడం మామూలే. ఈ కేసులు చూస్తుంటే ఎవరి ప్రేమేయంతో అవి ముందుకు వెళ్లడం లేదో తెలుస్తుంది. వీటిపై రాజకీయ ప్రభావం ఉందని తెలుస్తూనే ఉంది. మనకు నచ్చితే శ్రీక్రిష్ణుడు నచ్చకపోతే నిక్రిష్టుడు. ఇలా మన రాజకీయం మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.