Saudi Arabia accident : సౌదీ అరేబియాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు వారి కుటుంబం తిరిగిరాని లోకాలకు వెళ్లింది. నలుగురు ప్రయాణిస్తున్న వారి కారు ప్రమాదానికి గురి కావడంతో వారందరు సజీవదహనమయ్యారు. కువైట్ లోని అమెరికన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న దండు గౌస్ బాషా తన భార్య తబారక్ సర్వర్, ఇద్దరు కుమారులు ఏహాన్ (02), దామీల్ (8 నెలలు)తో కలిసి కువైట్ నుంచి పది రోజుల క్రితం సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు.
అక్కడ మక్కా, మదీన పుణ్యక్షేత్రాలను దర్శించుకుని కారులో తిరిగి కువైట్ కు వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రియాద్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో హఫ్నా రోడ్డుపై ఒక ట్రాలను వారి కారును ఢీకొంది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి నలుగురు సజీవదహనమయ్యారు. వారి వీసాలు కూడా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది.
వారి దేహాలను రియాద్ సమీపంలోని రూమా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సాయంతో సిద్ధిఖి తువూరు అనే ఒక ప్రముఖ సామాజిక కార్యకర్త ప్రోద్బలంతో బాధిత కుటుంబం అన్నమయ్య జిల్లా కడకడ మండల కేంద్రానికి చెందిన వారని తెలిసింది. కొన్నాళ్ల క్రితం వీరి కుటుంబం మదనపల్లికి తరువాత బెంగుళూరులో స్థిరపడినట్లు చెబుతున్నారు. దుర్ఘటన గురించి తెలియడంతో వారి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.
వారిని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. వారు కోలుకున్నాక వారికి సంబంధించిన దస్త్రాలు పంపితేనే కానీ వారి అంత్యక్రియలు ప్రారంభించరు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో గానీ లేదా అల్ రుమాలో కానీ వారి అంత్యక్రియలు చేపడతారని తెలుస్తోంది. దేశం కాని దేశంలో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. నలుగురు ఒకేసారి చనిపోవడం ఆ కుటుంబంలో శోకం పెరిగింది.