Anasuya జబర్దస్త్ యాంకర్ గా చేసిన అనసూయ గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు పదేళ్లు జబర్దస్త్ లో వ్యాఖ్యాతగా రాణించింది. తరువాత దానికి గుడ్ బై చెప్పి సినిమాల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. తరువాత పుష్పలో దాక్షాయణిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా సినిమాల్లో తనదైన శైలిలో నటిస్తోంది. ఇప్పుడు అనసూయ ఓ మంచి నటిగా తన కెరీర్ ను మలుచుకోవడం విశేషం.
అనసూయ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో విహరిస్తోంది. కుటుంబంతో వెకేషన్ కు వెళ్లిన ఆమె ప్రొఫెషనల్ ఈవెంట్లలో పాల్గొంటోంది. ఓ మ్యూజిక్ చానల్ లో సందడి చేస్తోంది. ఆమె డ్రెస్సింగ్ కు అందరు ఫిదా అవుతున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో తన ఫొటోలు షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. దీంతో అభిమానుల కామెట్లు హల్ చల్ చేస్తున్నాయి. అనసూయ ఫొటోలు ఇప్పుడు సందడి చేస్తున్నాయి.
ఇటీవల విడుదలైన రంగ మార్తాండ, విమానం చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. కథలో ప్రాధాన్యమున్న పాత్రలు చేసి శభాష్ అనిపించుకుంది. రంగమార్తాండ సినిమాలో గడసరి కోడలు పాత్ర చేసి మెప్పించింది. విమానం సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. స్లమ్ ఏరియాలో వ్యభిచారం చేసే పాత్రలో అనసూయ ఒదిగిపోయి నటించడంతో ఆమెకు ప్రతిష్ట పెరిగింది.
పుష్ప 2లో పవర్ ఫుల్ పాత్ర చేస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పెదకాపు సినిమాలో కూడా చేస్తోంది. విలేజ్ పొలిటికల్ డ్రామాగా పెదకాపు తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండతో ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరినా తరువాత క్రమంలో సర్దుబాటు అయినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియా పుణ్యమాని వీరి మధ్య మొదలైన తగాదా సర్దుమణిగినట్లు తెలుస్తోంది.