ఈ టీవీలో టెలీకాస్ట్ అవుతున్న జబర్దస్త్, ఢీ జోడీ మంచి ఫేమస్ షోలు. అయితే జబర్దస్త్ కంటే ఢీ జోడీకి ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలో బాగా వ్యత్సాసం ఉంది. కొరియోగ్రాఫర్ చైతన్య మరణం బుల్లితెరను కలవరపాటుకు గురి చేసింది. అప్పుల బాధను తట్టుకోలేకనే సూసైడ్ చేసుకుంటున్నానని ఆయన తీసిన వీడియో బుల్లితెర స్టార్ ల కళ్లల్లో కన్నీరు తెప్పింది. ఆయన లేడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేమని స్టార్ యాంకర్ల నుంచి, కొరియోగ్రాఫర్ల వరకూ అంటున్నారు. జబర్దస్త్ షోతో పోలిస్తే ఢీ జోడీకి ఆదరణ రోజు రోజుకూ తగ్గుతుందట. అందుకే చైతన్య తను ఈ షోకు ఎదురు పెట్టుబడి కూడా పెట్టినట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో పాటు మరి కొన్ని సంచలన విషయాలను కొరియోగ్రాఫర్ ఆట సందీప్ వివరించారు.
ఒక మీడియా సంస్థతో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ ఇటీవల మాట్లాడారు. ఢీ కొరియోగ్రాఫర్లకు తక్కువే ఇస్తున్నారని చెప్పారు. ఒక్కో పాటకు రూ. 3వేలు మాత్రమే ఇస్తున్నారని, ఇందులోనే టీంము కాస్టూమ్స్, ఫుడ్, ప్రాపర్టీస్, ట్రావెల్, రెమ్యునరేషన్ ఇలా అన్ని చెల్లించాలన్నారు. ప్రస్తుతం సాధారణ కూలికి రూ. వెయ్యి ఇస్తున్నారని, ఇంత తక్కువ ఇస్తే సరిపోవని, పైగా ఒక్కో సాంగ్ కు కొరియోగ్రఫీ చేయాలంటే రెండు, మూడు రోజులు పడుతుందని, డ్యాన్సర్లకు ఫుడ్, ట్రావెల్ ఖర్చులు ఎలా సరిపోతాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ షోతో కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు వస్తుందని బయటి నుంచి అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెడతామని ఆయన స్పష్టం చేశారు.
అయితే చైతన్య అప్పులపాటు అయ్యేందుకు ఇది కూడా కారణమని ఆట సందీప్ అన్నారు. జబర్దస్త్ తో పోలిస్తే మాకు అంత గౌరవం లేదని బాధపడ్డరు. ఒక్క రూపాయి ఇచ్చేందుకు వంద ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ. చైతన్య డెడికేషన్ ఉన్న పర్సన్. తన టీంకు గుర్తింపు రావాలని అహర్నిషలు కష్టపడతారు. అందుకే డ్యాన్స్ షోలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఒక ప్రైవేట్ ఆల్బం కూడా చేస్తున్నానని మాతో చెప్పాడు. ఆయనకు ఇన్ని అప్పులు ఉన్నాయని వాటితో సఫర్ అవుతున్నామని మాతో ఎప్పుడూ చెప్పలేదు. చెప్పి ఉంటే సాయం చేసి చైతన్యను బతికించుకునేవాళ్లం.