టాలీవుడ్ చాక్లెట్ బాయ్.. ఫక్తూ దేశముదురుగా మారతున్నాడు. ఇప్పటిదాకా డబుల్ చిప్తో బాక్సాఫీస్కే దమ్కీ ఇచ్చిన హీరో.. ఇప్పుడు ఆ డోస్ను మరింత పెంచబోతున్నాడు. అందుకోసం మళ్లీ పాత కాంబోను రిపీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెడ్, ద వారియర్ డిజాస్టర్ తరవాత బోయపాటితో పాన్ ఇండియా మూవీ చేస్తున్న రామ్.. తన తదుపరి సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
రామ్ బోయపాటి సినిమా తర్వాత.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ మూవీలో డబుల్ దిమాక్ తో చేసిన రచ్చను ఈ ఇద్దరూ ఇప్పుడు ఎక్స్ ట్రా ఎంటర్ టైన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. పైగా కథను పూరి తన స్టైల్లో సినిమాగా మలుస్తున్నారని అంటున్నారు. అయితే ఈ కాంబో రిపీట్ అవుతుందన్న న్యూస్ తో అటు రామ్ ఫాన్స్ లోను, ఇటు పూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
అయితే ప్లాప్ లు పూరికి కొత్త కానప్పటికీ లైగర్ రూపంలో తగిలిన దెబ్బ కి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. లైగర్ తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేద్దామనుకున్న పూరీ ఆశలకు గండిపడింది. ఇక చేసింది లేక జన గణ మన కి మంగళం పాడేశాడు. ప్రస్తుతం చేతిలో ఏ ప్రాజెక్టూ లేక పూరి ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది. దీంతో సాలిడ్ కం బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న పూరీ… మళ్లీ రామ్ తో హై వోల్టేజ్ సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కథని ప్రిపేర్ చేసుకుని డెవెలెప్ చేస్తూ.. రామ్ తో మీటింగ్ మొదలెట్టినట్టుగా టాక్. మరీ పూరీ గుడ్ న్యూస్ తో వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.